జోరు మీదున్న అఖిల్ కొత్త సినిమా

Update: 2018-06-17 05:49 GMT

'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మెయిన్ లీడ్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం జరుపుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర టీం మొత్తం యూకేకు వెళ్లనున్నారు. ఈనెల 20 నుండి దాదాపు రెండు నెలలు పాటు అక్కడే వేరు వేరు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్నారు.

టైటిల్ ఫిక్స్ చేశారా..?

అక్కడ ప్రధాన పాత్రల కాంబినేషన్లో చిత్రీకరణను జరపనున్నారు. షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి దసరాకి విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. టీంతో పాటు అటు నాగార్జునకి కూడా ఈ టైటిల్ నచ్చడంతో ఇది ఫిక్స్ చేసినట్టు సమాచారం. తమన్ అందిస్తున్న ట్యూన్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతాయి అని ఆశిస్తున్నారు. ఈ మూవీతో అఖిల్ కచ్చితంగా హిట్ కొడతాడని భావిస్తున్నారు. 'తొలిప్రేమ' లాగా ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతున్నారు.

Similar News