మరోసారి వాయిదా పడ్డ అక్కినేని హీరో సినిమా..!

Update: 2018-10-09 07:44 GMT

తొలి రెండు చిత్రాలు పరాజయంతో మూడో చిత్రం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో అఖిల్ అక్కినేని ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో అఖిల్ చాలా కొత్తగా కనిపించాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదట డిసెంబర్ 21న విడుదల చేద్దామనుకున్నారు. కానీ కొన్ని కారణాలు వల్ల ఆ రోజున ఈ సినిమా విడుదల అవట్లేదు. అదే రోజున మరో రెండు సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’తో పాటు శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ రిలీజ్ అవుతున్నాయి.

పోటీ ఎక్కువగా ఉండటంతో...

ఈ రెండు సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి అదే రోజు అఖిల్ సినిమా వస్తే ఆ పోటీని తట్టుకోలేము అనుకున్నారేమో కానీ జనవరి 24న విడుదల చేద్దాం అని నిర్ణయించుకున్నారు. కానీ ఆ రోజు బాలకృష్ణ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం రిలీజ్ అవుతున్నట్టు ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే మళ్లీ ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని వాయిదా వేసారట. ఫిబ్రవరి 14న ప్రేమికులు రోజున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే బాగుంటదని భావిస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. మరి ఏమి జరుగుతుందో చూడాలి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Similar News