మిస్ట‌ర్ మ‌జ్నుగా అఖిల్‌

Update: 2018-11-07 11:50 GMT

అక్కినేని అఖిల్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మిస్టర్‌ మజ్ను'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, నవంబర్ 7న‌ దీపావళి పర్వదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అఖిల్‌ కొత్త స్టిల్‌ను, పోస్టర్‌ను విడుదల చేశారు. అఖిల్‌ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 

Similar News