లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తున్నాడు..!

ఈ సంక్రాంతికి కోలీవుడ్ లో రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రజనీ ‘పేట’తో పాటు అజిత్ ‘విశ్వాసం’ కూడా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం [more]

Update: 2019-01-23 06:44 GMT

ఈ సంక్రాంతికి కోలీవుడ్ లో రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రజనీ ‘పేట’తో పాటు అజిత్ ‘విశ్వాసం’ కూడా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ‘పేట’ తెలుగులో రిలీజ్ అయ్యి పర్లేదు అనిపించుకుంది కానీ థియేటర్లు దొరకక ‘విశ్వాసం’ తెలుగులో రిలీజ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 1న విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు తెలుగు నిర్మాతలు. తెలుగులో అజీత్ కి పెద్ద మార్కెట్ లేకపోవచ్చు కానీ ఇందులో హీరోయిన్ గా నయనతార, విలన్ గా జగపతి బాబు నటించారు కాబట్టి ఆడితే వీరి వల్ల ఈ సినిమా ఆడాలి.

మన ప్రేక్షకులు ఆదరిస్తారా..?

అంతా బాగానే ఉంది కానీ ‘విశ్వాసం’ తమిళ్ నేటివిటీతో కూడిన మాస్ సినిమా కాబట్టి మన ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది సందేహంగా మారింది. ఇకపోతే తమిళంలో ఈ సినిమా మొదటి రోజే 26 కోట్లను వసూళు చేసినట్టు తెలుస్తోంది. శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఇక్కడ ప్రేక్షకులు ఈ మూవీకి ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News