ఎన్టీఆర్ తర్వాత మహేషే!!

ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ మహేష్ తోనే సినిమా చెయ్యబోతున్నాడు.. ఇది పక్కా. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఖలేజా, అతడు సినిమాల తర్వాత మహేష్ [more]

Update: 2020-10-07 07:43 GMT

ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ మహేష్ తోనే సినిమా చెయ్యబోతున్నాడు.. ఇది పక్కా. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఖలేజా, అతడు సినిమాల తర్వాత మహేష్ తో మరోసారి త్రివిక్రమ్ కాంబో రిపీట్ కాబోతుంది ఆనేది మహేషే కన్ఫర్మ్ చేసేసాడు. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఖలేజా సినిమా విడుదలై 10 ఏళ్లయినా సందర్భంగా మహేష్ మరోసారి త్రివిక్రమ్ తో సినిమాని కన్ఫర్మ్ చేసి క్లారిటీ ఇచ్చేసాడు. ఖలేజా, అతడు థియేటర్స్ లో యావరేజ్ గా ఆడినా బుల్లితెర మీద రియార్దులు బద్దలు కొట్టాయి. అలాంటి కాంబోలో హ్యాట్రిక్ మూవీపై మహేష్ అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు.  మరి తాజాగా ఇచ్చిన క్లారిటీ మహేష్ అభిమానులే కాదు… తెలుగు ప్రేక్షకులంతా ఇంట్రెస్టింగ్ అంటున్నారు.

అతి త్వ‌ర‌లోనే మా కాంబినేషన్ రాబోతోంది… త్వరలోనే త్రివిక్రమ్ తో నా సినిమా అంటూ మహేష్ హింట్ ఇచ్చేసాడు. మరి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా చెయ్యగానే మహేష్ తో సినిమా చేస్తాడన్నమాట. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. RRR పూర్తవగానే త్రివిక్రమ్ తో కొత్త మూవీ మొదలు పెడతాడు. మరి ఇప్పటికే ఎన్టీఆర్ స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్న త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా నటుల ఎంపిక చేపట్టాడనే టాక్ ఉంది. మరి ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ మహేష్ తో పక్కా. మహేష్ సర్కారు వారి పాట పూర్తి చేసుకుని కొద్దీ గ్యాప్ తో త్రివిక్రమ్ మూవీ మొదలు పెట్టేలా ఉన్నాడు. ఖలేజా సినిమాతో నటుడిగా త‌న‌ని తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకున్నాన‌ని…. ఇదంతా త్రివిక్ర‌మ్ వ‌ల్లే జరిగింది అంటూ ఖలేజా వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసిన మహేష్ తమ తదుపరి చిత్రంపై ఆసక్తిగా ఉన్నట్లుగా ట్వీట్ చెయ్యడంతో మహేష్ – త్రివిక్రమ్ కాంబోపై జనాల్లో క్లారిటీ వచ్చేసింది.

Tags:    

Similar News