ముందు ప్రభాస్ తో ఫోటో షూట్.. తర్వాతే ఫైనల్!!

ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో రాధేశ్యాం షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ కి తిరిగి రావడమే కాదు.. ఆదిపురుష్ కథా చర్చల కోసం ముంబైలో బిజీ బిజీ గా [more]

Update: 2020-11-14 05:43 GMT

ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో రాధేశ్యాం షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ కి తిరిగి రావడమే కాదు.. ఆదిపురుష్ కథా చర్చల కోసం ముంబైలో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ కథా చర్చలు, అలాగే లొకేషన్స్ కోసం ప్రభాస్ – దర్శకుడు ఓం రౌత్ లు నిర్మాతలతో మీటింగ్స్ పెట్టారట. మరోపక్క ప్రభాస్ కోసం భారీలెవల్లో ఖర్చు పెడుతున్న టి సీరీస్ కే షాకిస్తున్న యువి క్రియేషన్స్ నిర్మాతలు. ఎందుకంటే ప్రభాస్ రాధేశ్యాం క్లైమాక్స్ కోసం యువి నిర్మాతలు ఏకంగా 30 కోట్లు కహ్చుపెడుతున్నారనే టాక్ ఉంది.. మరి ఇప్పుడు నిర్మాతలంతా ప్రభాస్ రేంజ్ ని నిలుపుకోవడానికి కోట్లు పోసేస్తున్నారు. అయితే తాజాగా ముంబై లో ఓం రౌత్ తో కలిసి జర్నీ చేస్తున్న ప్రభాస్ కోసం దర్శకుడు, నిర్మాతలు హీరోయిన్ వేటలో ఉన్నారట.

ఎలాగూ ప్రభాస్ ముంబై లోనే ఉన్నాడు కాబటి..కొంతమంది హీరోయిన్స్ ని ఆదిపురుష్ కోసం ఆడిషన్స్ నిర్వహించి.. ఒకవేళ ఓకె అనుకుంటే.. ప్రభాస్ తో ఫొటో షూట్ చేసాక పర్ఫెక్ట్ అనుకుంటే ఆతర్వాత హీరోయిన్ ఫైనల్ అవుతుందట. మరి రాముడిగా ప్రభాస్ కి సాటి రాగల సీత కోసం ఓం రౌత్ కష్టలు మాములుగా లేవు. ఇక ఇప్పటివరకు హీరోయిన్స్ గా కీర్తి సురేష్, కృతి సనన్, కియారా పేర్లు వినిపించినా.. ఇప్పుడు రాముడి కోసం ఫోటో షూట్ చేసి.. వాళ్లు ప్రభాస్ కి సరిజోడి అనుకున్నాకే ఆ హీరోయిన్ పేరు బయటికి వస్తుంది. మరి విలన్ గా ఓం రౌత్ బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ని ఈజీగానే సెలెక్ట్ చేసుకున్నాడు కానీ.. హీరోయిన్ విషయంలో ఇంకా తెగడం లేదు.

Tags:    

Similar News