ఎవరు ‘ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టేనా?

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ఎవరు’ సినిమా పై బయ్యర్లు 10 కోట్లు ఇన్వెస్ట్ పెట్టారట. అడివి శేష్ కి గూఢచారి లాంటి సూపర్ హిట్ చిత్రంతో [more]

Update: 2019-08-20 08:07 GMT

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ఎవరు’ సినిమా పై బయ్యర్లు 10 కోట్లు ఇన్వెస్ట్ పెట్టారట. అడివి శేష్ కి గూఢచారి లాంటి సూపర్ హిట్ చిత్రంతో 10 కోట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఎవరు సినిమాను 10 కోట్లు పెట్టి కొన్నారు బయ్యర్స్. ప్రేక్షకుల మీద కాన్ఫిడెంట్ తో కంటెంట్ మీద నమ్మకంతో అడివి శేష్ తన సినిమాను శర్వా సినిమా ‘రణరంగం’ కి పోటీగా దింపాడు.

రణరంగం కి బాడ్ టాక్ రావడం ‘ఎవరు’ మూవీ కి ఇంకా ప్లస్ అయింది. ఈమూవీ తొలి వారాంతంలోనే డెబ్బయ్‌ శాతం రికవర్‌ చేసుకోగలిగింది. ఇక వీక్ డేస్ లో కూడా ఈమూవీ డీసెంట్ కలెక్షన్స్ తో పర్లేదు అనిపించుకునే అవకాశముంది. ఎలాగో ఈవారం పెద్ద సినిమా ఏది లేదు కాబట్టి ‘ఎవరు’ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లే అవకాశముందని తెలుస్తుంది.

అలానే అమెరికా లో కూడా ఈమూవీ ఇప్పటికే మూడు లక్షల యాభై వేల డాలర్లు వసూలు కావడంతో హాఫ్‌ మిలియన్‌ కావడానికి స్కోప్‌ పెరిగింది. ఇలా శేష్ మార్కెట్ ప్రతి సినిమా కి పెరుగుతూ వస్తుంది.

Tags:    

Similar News