సినిమాల్లేవ్.. పెళ్లికి రెడీ అయ్యింది..!

Update: 2018-11-29 06:10 GMT

తన మొదటి సినిమా 'కొత్త బంగారు లోకం'తో యువ హృదయాలు గెలుచుకున్న శ్వేతా బసు తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ కి రాక ముందు బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేసిన శ్వేతా బసు తెలుగులో 'కొత్త బంగారు లోకం'' తరువాత తమిళంలో నాలుగు సినిమాలు చేసింది. అన్ని భాషల్లో కలిపి మొత్తంగా 20 సినిమాలు కూడా చేయలేదు ఈ అమ్మడు. ప్రస్తుతం తన కెరీర్ అంతంత మాత్రంగా ఉంది. ఈ నేపధ్యంలో ఆమె ఓ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆమె ఓ ఇంటామె అవ్వబోతుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న టైంలో ఆమె ఈ విషయాలు చెప్పింది. కొన్నేళ్లుగా ఈమె డేటింగ్ లో ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నట్టుగా చెప్పింది. అతని పేరు రోహిత్ మిట్టల్. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.

పెళ్లి తర్వాత కూడా సినిమాలు

వచ్చే నెల డిసెంబర్ లో వీరి మ్యారేజ్ పుణేలో జరుగుతుందని టాక్. బాలిలో వీళ్లు బ్యాచిలర్ పార్టీ మూడ్ లో ఉన్నారట. మరి పెళ్లి తరువాత సినిమాలు కంటిన్యూ చేస్తుందా? లేదా? అన్న విషయాలు మాత్రం షేర్ చేసుకోలేదు. మ్యారేజ్ తరువాత కూడా సినిమాలు చేస్తా అని తన ఫ్రెండ్స్ కి చెప్పిందంట. టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు అయితే కష్టం. పెళ్లికి ముందే ఈమెకు అవకాశాలు తక్కువ. అలాంటప్పుడు పెళ్లి తరువాత ఎందుకు వస్తాయి? మన టాలీవుడ్ లో పెళ్లి తరువాత హీరోయిన్స్ స్క్రీన్ పై సెట్ అవ్వరని ఓ సెంటిమెంట్ ఉందిగా. మరి ఇతర భాషల్లో ఏమన్నా ట్రై చేస్తుందేమో..!

Similar News