ఈ జంట చాలాకాలనికి కలిసి కనిపిస్తున్నారు..!

Update: 2018-08-01 07:01 GMT

హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లాడింది. అమితాబ్ ఇంటి కోడలిగా... అభిషేక్ కి భార్యగా.. ఆరాధ్యకి తల్లిగా ఐశ్వర్య తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మల్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఐశ్వర్య సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వకముందు అభిషేక్, ఐశ్వర్య గురించిన వార్తలేమి మీడియాలో వచ్చేవి కావు. కానీ ఐష్ సినిమాల్లోకి తిరిగొచ్చాక అమితాబ్, అభిషేక్ కి ఐశ్వర్య పద్ధతులు నచ్చడం లేదని, జయ బచ్చన్ కూడా కోడలితో కాస్త అంటీముట్టనట్లుగా వుంటుందనే న్యూస్ హల్చల్ చేసింది. ఇక ఈ మధ్య కాలంలో అభిషేక్, ఐశ్వర్య కి గొడవలు జరుగుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా కోడలిపై ప్రేమ చూపడం లేదని.. కూతురు శ్వేతా బచ్చన్ పై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నాడంటూ.. ఇలా అమితాబ్ ఫ్యామిలీ మీద రోజుకో వార్త బయలు దేరింది.

భర్త అభిషేక్ సినిమా ఉంటుందన్న ఐష్

ఇక కొన్ని సందర్భాల్లో అభిషేక్ బచ్చన్ తమ ఇంటి గొడవలపై హుందాగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నవారికి ఘాటు రిప్లై ఇస్తూనే ఉన్నాడు. ఇక ఇలా అభిషేక్ కి, ఐష్ కి గొడవల మూలాన వారిద్దరూ ఇక సినిమాల్లో కలిసి కనిపించే అవకాశం లేదని చాలా మందే ఫిక్స్ అయ్యారు. అయితే వారిద్దరూ కలిసి నటించే విషయమై ఐశ్వర్య రాయ్ ఇప్పుడు పూర్తి క్లారిటీ ఇచ్చింది. తాను తన భర్త అభిషేక్ త్వరలోనే ఒక సినిమాలో కలిసి నటించబోతున్నట్టుగా చెప్పింది. ప్రస్తుతం తాను ఫ‌న్నేఖాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఐశ్వర్య రాయ్ తాను తన భర్త ఒక సినిమాలో నటించబోతున్నామని... అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో ఈ సినిమా ఉంటుందని తెలిపింది.

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమా టైటిల్ ని కూడా రివీల్ చేసింది ఐష్. గులాబ్ జామున్ అనే టైటిల్ తో ఆ సినిమా తెరకెక్కబోతుంది.. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా ఉండబోతుందని... ఇక ఈ సినిమా లో ఐశ్వర్య , అభిషేక్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా సమాచారం. మరి ఐశ్వర్య మరియు అభిషేక్ దాదాపుగా ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు వెండితెర మీద కనిపిస్తున్నారు. గతంలో ధూమ్ 2, గురు, రావణ్ ఇలా చాలా సినిమాల్లో కలిసి నటించారు.

Similar News