నిర్మాతల కోసం అయినా " ఆటగాళ్ళు" ఆడాలి..!

Update: 2018-08-22 13:30 GMT

నారా రోహిత్ హీరోగా దర్శన బానిక్ హీరోయిన్ గా జగపతిబాబు ముఖ్యపాత్రలో పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ఆటగాళ్లు. నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజిప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 24న రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జగపతిబాబు మాట్లాడుతూ "- ఆటగాళ్లు లాంటి సినిమా చేయడం కొంతవరకు రిస్కే. అయినా నిర్మాతలు బడ్జెట్ కి ఎక్కడా వెనకాడకుండా సినిమాని చాలా రిచ్ గా నిర్మించారు. క్రైం, కోర్టు డ్రామా, అన్నీ చాలా కొత్తగా ఉంటుంది. స్క్రీన్ ప్లై బాగా వర్కవుట్ అయింది. ఆటగాళ్లు గ్యారెంటీ గా సక్సెస్ అవుతుంది. మా కోసం కాకా పోయినా నిర్మాతల కోసం ఈ చిత్రం ఆడాలి. ఫస్ట్ టైం లాయర్ క్యారెక్టర్ చేసాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను" అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ .."బాణం, ప్రతినిధి, రౌడీఫెలో చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసాను. ఆటగాళ్లు చిత్రం కొత్త జోనర్ నాకు. నేను చాలా సినిమాలు చేశాను. రిజల్ట్ విషయం పక్కన పెడితే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశానని తృప్తి కలిగింది. ఈ సినిమా బాగా ఆడి నిర్మాతలకు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు ".

Similar News