50 లక్షలు తీసుకుంటా అంటున్న హీరోయిన్

Update: 2018-04-28 06:13 GMT

బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా తానేంటో అని ప్రూవ్ చేసుకోవాలని చాలానే ట్రై చేస్తుంది హీరోయిన్ అదితీరావు. తెలుగులో వచ్చిన ఆఫర్స్ ని సద్వినియోగం చేసుకుంటోంది. అలానే సుధీర్ బాబు తో 'సమ్మోహనం' సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. వరుణ్ తేజ్ - సంకల్ప్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అదితీరావు.

కొంతమంది స్టార్ హీరోస్ సినిమాల కోసం ఈ హీరోయిన్ ని సంప్రదిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆమె తన పారితోషికం పెంచేసిందనే టాక్ గెట్టిగా వినిపిస్తుంది. ఇక నుండి సినిమాకు 50 లక్షలు తీసుకోవాలని డిసైడ్ అయిందంట బాలీవుడ్ క్వీన్.

ఇప్పటికే టాలీవుడ్ చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు మరి వారికి పోటీగా అదితీరావు నిలపడుతుందా లేదో చూడాలి. సరైన హిట్ కొడితే ఇప్పుడున్న పారితోషికం రెట్టింపు కావడం ఖాయమనే విషయంలో ఎలాంటి సందేహం లేదు

Similar News