ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్ @30 కోట్లు?

ప్రభాస్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు రెడీ. ఆ విషయం బాహుబలితోనే తేలిపోయింది. సాహో విషయంలోనే యువీ నిర్మాతలు ప్రభాస్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. [more]

Update: 2020-11-12 16:27 GMT

ప్రభాస్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు రెడీ. ఆ విషయం బాహుబలితోనే తేలిపోయింది. సాహో విషయంలోనే యువీ నిర్మాతలు ప్రభాస్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ కోసం కోట్లు కుమ్మరించారు. సాహో సినిమా కంటెంట్ పరంగా వీక్ అయినా.. యాక్షన్ పరంగా హాలీవుడ్ రేంజ్ ఉన్న సినిమా. అయితే కోట్లు కుమ్మరిస్తున్నాం అంటే.. అది వర్కౌట్ అయితే ఓకె. లేదంటే అదంతా వృధానే. తాజాగా ప్రభాస్ రాధేశ్యాం సినిమాలో ఒకే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది అని.. అది కూడా స్టైలిష్ గా భారీ లెవల్లో ఉండబోతుంది అని ప్రభాస్ చెప్పాడు.

అయితే ఇప్పుడు రాధేశ్యాం సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసారని.. దాని కోసం నిర్మాతలు అక్షరాలా 30 కోట్లు ఖర్చుపెట్టబోతున్నట్లుగా ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ కూడా రాధేశ్యాం క్లైమాక్స్ లో ఉండబోతుంది అని.. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్, ఆస్కార్ విజేత నిక్ పావెల్ ఈ యాక్షన్ ఎపిసోడ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడట. హైదరాబాద్ లో భారీ సెట్స్ వేసి ఈ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించడానికి నిర్మాతలు 30 కోట్లు ఖర్చుపెడుతున్నారట. మరి లవ్ స్టోరీ అంటూనే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం అన్ని కోట్లు ఖర్చు అంటే.. అది ఏ రేంజ్ లో ఉండబోతుందో అది ఊహకి కూడా అందడం లేదు.

Tags:    

Similar News