'2.ఓ' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న క్రిష్ !

Update: 2018-05-30 08:53 GMT

శంకర్ - రజిని కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ చిత్రం రోబో '2.o'. ఈ సినిమా గురించి ప్రేక్షకులు పటించుకోవటం మానేశారు. ఎందుకంటే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడడం దానికి కారణం. ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు పోస్టర్స్ రిలీజ్ చేసారు తప్ప దానికి సంబంధించి వీడియో రూపంలో టీజర్స్ కానీ..ట్రైలర్స్ కానీ రిలీజ్ చేయలేదు.

2.ఒ ముందా..తరువాతా...

అయితే, కంగనా రనౌత్ ప్రధాన పాత్రగా ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్రను 'మణికర్ణిక' పేరుతో క్రిష్ రూపొందించాడు. ఈ సినిమాను క్రిష్ ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే అదే రోజున రోబో '2.o' చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ శంకర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

శంకర్ ప్రకటన కోసం వెయిటింగ్...

దాంతో క్రిష్ తన సినిమాను సెప్టెంబర్ కి వాయిదా వేసుకుని ఆ దిశగా పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తీరా చుస్తే రోబో '2.o' సెప్టెంబర్ కు వాయిదా పడుతుందనే వార్తలు రావడంతో క్రిష్ తన సినిమాను ముందుగా అనుకున్న ఆగస్టు 15 న విడుదల చేద్దామా అని ఆలోచనల్లో పడినట్టు తెలుస్తుంది. దాంతో '2.ఓ' దర్శక నిర్మాతల నుంచి రానున్న అధికారిక ప్రకటన కోసం క్రిష్ వెయిట్ చేస్తున్నాడట.

Similar News