మహేష్ 33 రికార్డుని తుడిచేసిన రజనీ 35..!

Update: 2018-11-28 08:41 GMT

ఇప్పుడు ఎక్కడ చూసిన 2.ఓ మీద వార్తలే. సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ ల కాంబోలో తెరకెక్కిన 2.ఓ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. రేపు వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో విడుదల కాబోతున్న 2.ఓ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హిట్ కొట్టాలని అందరూ ఆశిస్తున్నారు. రేపు ఈ టైం వరకు 2.ఓ జాతకం తెలిసిపోతుంది. సినిమాకి భారీగా ఖర్చుపెట్టిన నిర్మాతలు పబ్లిసిటీ విషయంలో వెనక్కి తగ్గారు. ఏదో ఒక ప్రెస్ మీట్, ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్ లు చేసేసి హడావిడి చేశారు. మరి భారీ బడ్జెట్ చిత్రం కదా భారీగా అంచనాలు ఉన్నాయి కదా ప్రమోషన్స్ అక్కర్లేదనుకున్నారేమో. సరే అది వేరే విషయం. ప్రస్తుతం ఓపెనింగ్స్ తోనే కొత్త రికార్డులను సృష్టించడానికి రెడీ అవుతున్నారు 2.ఓ టీం.

మహేష్ రికార్డు బద్దలు...

తాజాగా రజనీకాంత్ 2.ఓ సినిమా మహేష్ బాబు రికార్డులను తుడిచేసింది. మహేష్ బిజినెస్ మ్యాన్ తో ఉన్న ఒక రికార్డును మళ్లీ ఇన్నాళ్లకు 2.ఓ సినిమా తుడిచేసింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాని 10,000 స్క్రీన్స్ పైగానే విడుదల చేస్తున్నారు. అయితే ఈ 2.ఓ సినిమాని హైదరాబాద్ కి మొట్టమొదటి మల్టిప్లెక్స్ థియేటర్ అయిన ప్రసాద్ ఐమ్యాక్స్ లో సినిమా విడుదల రోజు అంటే రేపు దాదాపుగా 35 షోలు వెయ్యనున్నారట. గతంలో పూరి జగన్నాధ్ - మహేష్ కాంబోలో వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమాని ప్రసాద్ ఐమ్యాక్స్ లో 33 షోస్ వేశారు.

Similar News