అదంతా అక్షయ్ సత్తానేనా...!

Update: 2018-12-07 07:55 GMT

రజినీకాంత్ - శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.ఓ విడుదలై అప్పుడే వారమైంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 10,000 స్క్రీన్స్ కి పైగా విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళంలో బ్రేక్ ఈవెంట్ సాధించడం మాట అలా ఉంచి... అమ్మిన దానిలో సగం కూడా వచ్చేలా కనబడ్డం లేదు. ఈ సినిమాలో రజినీకాంత్ హీరో అనే కన్నా అందులో విలన్ గా నటించిన అక్షయ్ పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమాలో అక్షయ్ పాత్రని మనం నెగెటివ్ గా తీసుకోలేం. ఎందుకంటే సెల్ ఫోన్ వలన రేడియేషన్ పెరిగి పక్షులు చనిపోవడంతోనే అక్షయ్ పక్షిరాజ్ గా నెగెటీవ్ శక్తిగా ఎదిగాడు. కేవలం సెల్ ఫోన్ వాడిన వారికి మాత్రమే శత్రువయ్యాడు కానీ... మిగతా విషయాల్లో అక్షయ్ పాత్ర చాలా పాజిటివ్ గానే ఉంది.

పక్షి రాజ్ పాత్రకు ఫిదా....

అందుకే అక్షయ్ పాత్రకి హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. హిందీలో హీరోగా నటించిన అక్షయ్ కుమార్ ఇలా సౌత్ సినిమాలో విలన్ అవతారమెత్తినా... 2.ఓ లో అక్షయ్ కుమార్ మేకప్, ఆయన అవతారాలు, పక్షిరాజ్ క్యారెక్టర్ వంటివన్నీ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే తెలుగు, తమిళంలో సత్తా చాటలేకపోయిన 2.ఓ సినిమా బాలీవుడ్ లో మాత్రం అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. వీకెండ్స్ లోనే కాదు.. వీక్ డేస్ లోనూ 2.ఓ బాలీవుడ్ లో సత్తా చాటుతుంది. 2.ఓ వారం తిరిగేసరికి హిందీ వెర్షన్ వసూళ్లు 123 కోట్లకు చేరుకున్నాయి. అక్కడ త్వరలోనే 2.0 బ్రేక్ ఈవెన్ కు రానుంది.

అక్షయ్ స్టామినానే...

ఇలా హిందీ వెర్షన్ మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించడానికి కారణం మాత్రం అక్షయ్ కుమార్ స్టామీనానే అంటున్నారు. అక్షయ్ కి ఉన్న ఫాలోయింగ్, అలాగే అక్షయ్ పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతోనే 2.ఓ అక్కడ సత్తా చాటింది అని అంటున్నారు. మరి 2.ఓ హిందీలో కలెక్షన్స్ ఆ రేంజ్ రావడానికి రజినీ మానియా కారణం కాదంట.. కేవలం అక్షయ కుమార్ దే హవా అంటున్నారు.

Similar News