2.0 ని లైట్ తీసుకుంటున్నారు

Update: 2018-12-01 04:42 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి సినిమా వీవీ వినాయిక్ డైరెక్షన్ లో నటించాడు. 'అల్లుడు శ్రీను' యావరేజ్ గా అనిపించుకుంది. ఆ తరువాత వచ్చిన ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాయి. ఈనేపధ్యంలో తనకు ఒక్క హిట్ అయిన అవసరం అనుకుని రెండు సినిమాలు వరసగా చేస్తున్నాడు శ్రీనివాస్. తేజ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో కాజల్ హీరోయిన్. మరొకటి కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తో చేస్తున్నాడు.

ఈసినిమాకు ‘కవచం’ అనే టైటిల్ ను పెట్టారు. ఇందులో కూడా కాజల్ హీరోయిన్. మెహ్రీన్ ఇంకో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. మొదట ఈసినిమాను ‘2.0’కి పాజిటివ్ టాక్ వస్తే విడుదల తేదీ వాయిదా వేద్దాం అనుకున్నారు. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ‘2.0’కి పోస్జిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈసినిమాను వాయిదా వేయట్లేదు.

ముందుగా చెప్పినట్టుగా డిసెంబర్ 7వ తేదీన విడుదల అవుతుందని చెబుతున్నారు. నిన్నటి నుండి రిలీజ్ డేట్ ప్రోమోస్ కూడా విడుదల చేసారు. ఈమూవీపై పూర్తిగా చూసి కొనుగోలు చేసిన బయ్యర్లు కూడా కంటెంట్ పై నమ్మకంతోనే ఉన్నారట. అందుకే అనుకున్న టైం కి రిలీజ్ చేస్తున్నారు. ఇక అదే రోజు ‘సుబ్రహ్మణ్యపురం’.. ‘భైరవగీత’.. ‘హుషారు’ థియేటర్లలోకి వస్తున్నాయి. ఈసినిమాలతో కవచం ఎలా తట్టుకుంటాదేమో చూడాలి

Similar News