'2.0' చిత్రానికి షాకింగ్ బడ్జెట్!

Update: 2018-09-11 06:11 GMT

'బాహుబలి' రెండు పార్టులు కలిపితే ఐదున్నర గంటలు లోపే నడివిడి ఉంటుంది. ఈసినిమా రెండు పార్టులు కలిపితే నాలుగు వందల కోట్లు ఖర్చు అయింది. అలాంటిది శంకర్ సృటించిన '2.0' చిత్రానికి 75 మిలియన్‌ డాలర్లు బడ్జెట్ అయిందని నిర్మాతలు చెప్పుకుంటున్నారు. కేవలం గంటన్నర నిడివి ఉన్న ఈచిత్రంతో 'బాహుబలి' బడ్జెట్ ను దాటేశామని చెబుతున్నారు '2.0' మేకర్స్.

డబ్బు వృధా అయిందా...?

ఈమూవీ కోసం ఏకంగా వందల కోట్లకు పైగా ఖర్చు అయిందని నిర్మాతలు అఫిషల్ గా అనౌన్స్ చేశారు. మరి నిజానికి ఇంత ఖర్చు అయిందో లేదో తెలియదు కానీ ఈసినిమాను తెరకెక్కించేందుకు భారీగా డబ్బు అయితే వృధా అయిందని అర్ధం అవుతుంది. మొదటి ఈసినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ ఓ ప్రముఖ కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ వారు ఉన్నట్టుండి దివాలా తీయడంతో ఆ వర్క్ మొత్తం వదిలేసుకుని వేరే కంపెనీలకి కాంట్రాక్ట్‌ ఇచ్చారు.

వడ్డీలతో కలిపి......

కేవలం గ్రాఫిక్స్ వర్క్స్ కే చాలా ఖర్చు అయిందని చెబుతున్నారు. దానికి తోడు సినిమా బాగా లేట్ అయింది. దాంతో వడ్డీలు ఎక్కువ అయ్యిపోయాయి. అందుకే ఈసినిమాకి తెలియని ఖర్చు అయింది తెలుస్తుంది. ఏదేమైనా ఇది భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలుస్తుంది. బడ్జెట్ అయితే ఇంత అయింది మరి కలెక్షన్స్ ఆ విధంగానే వస్తాయా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఇక ఈచిత్రం టీజర్ ఈనెల 13న రిలీజ్ అవ్వబోతుంది. అలానే సినిమా నవంబర్ 29న విడుదల అవుతున్నట్టు అధికారంగా ప్రకటించారు.

Similar News