'2.0' అరుదైన రికార్డు

Update: 2018-12-14 02:20 GMT

రజిని - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన విజువల్ వండర్ '2.0' చిత్రం గత నెల నవంబర్ 29 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఇండియా లో తమిళ..తెలుగు..హిందీ భాషల్లో ఈసినిమా ప్రతి ప్రాంతంలోను తన జోరును చూపించింది.

ఈ మూడు భాషల్లో రోజుకొక కొత్త రికార్డులను నెలకొల్పుతూనే వుంది. ముందుగా ఈసినిమా హిందీలో 100 కోట్లు గ్రాస్ ను వసూలు చేసింది. ఆ తరువాత తెలుగు..తమిళ భాషల్లో 100 కోట్ల మార్క్ ను చేరుకుంది. నిజానికి ఈసినిమాను తమిళం లో కన్న తెలుగు లోనే ఎక్కువ ఆదరిస్తున్నారు.

ఇలా మూడు వెర్షన్లలో విడుదలై ప్రతి భాషలోను 100 కోట్ల గ్రాస్ ను రాబట్టి 'బాహుబలి' తరువాతి చిత్రంగా ఈ రికార్డును దక్కించుకుంది. ఇలా '2.0' ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈసినిమా థియేటర్స్ ఇంకా సెన్సషన్స్ క్రియేట్ చేస్తుండగానే రజిని నటించిన మరో సినిమా 'పెట్ట' సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వనుంది. సో రజిని ఫ్యాన్స్ కి సందడి నాన్ స్టాప్ గా కొనసాగుతూనే వుంది.

Similar News