Thu Mar 19 2026 04:11:38 GMT+0530 (India Standard Time)
డబుల్స్ లో 8వ సీడ్ కు షాకిచ్చిన ధృవ్ కపిల- MR అర్జున్ జోడీ
వరల్డ్ ఛాంపియన్స్ చివరి ఎడిషన్లో కిమ్ ఆస్ట్రప్- అండర్స్ రాస్ముస్సేన్ కాంస్య పతకాన్ని సాధించారు.

టోక్యోలో జరుగుతున్న BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో 8వ సీడ్ కు ఊహించని షాక్ ఇచ్చింది భారత యువ పురుషుల డబుల్స్ జోడీ. ధృవ్ కపిల- MR అర్జున్ 8వ సీడ్ కిమ్ ఆస్ట్రప్- అండర్స్ రాస్ముస్సేన్లను 2వ రౌండ్లో ఓడించారు. బుధవారం ఆగస్టు 24న జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని భారత డబుల్స్ బృందం సొంతం చేసుకుంది.
వరల్డ్ ఛాంపియన్స్ చివరి ఎడిషన్లో కిమ్ ఆస్ట్రప్- అండర్స్ రాస్ముస్సేన్ కాంస్య పతకాన్ని సాధించారు. వారిని ఓడించడానికి ధ్రువ్ కపిల, MR అర్జున్లకు కేవలం 40 నిమిషాలు మాత్రమే అవసరమైంది. 2వ రౌండ్ మ్యాచ్లో 21-17, 21-16 తేడాతో భారత జోడీ విజయం సాధించింది. 2022లో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న ధృవ్- అర్జున్లకు ఇది పెద్ద విజయం. ఈ మ్యాచ్ లో గెలిచి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్లో చోటు సంపాదించారు. ప్రపంచ నం. 35 జోడీ అయిన ధృవ్- అర్జున్ లు ప్రపంచ ఛాంపియన్షిప్లో ప్రారంభ రౌండ్లో సుపక్ జోమ్కో, కిట్టినుపాంగ్ కేడ్రెన్ల నుండి గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని అందుకుంది. ధృవ్-అర్జున్ జోడీ ఇటీవలి కాలంలో మంచి ప్రదర్శన చేస్తూ వెళుతున్నారు. భారతదేశం తరపున రెండవ అత్యధిక ర్యాంక్ కలిగి ఉన్న పురుషుల డబుల్స్ జోడీ ఇది. మంచి ఫామ్లో ఉన్నారు, ప్రపంచ ఛాంపియన్షిప్కు ముందు సింగపూర్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు.
News Summary - Indian Mens Doubles pair Dhruv Kapila MR Arjun defeated world number 8
Next Story

