Mon Jan 12 2026 06:35:06 GMT+0000 (Coordinated Universal Time)
మేడారానికి పోటెత్తిన భక్తులు
మేడారానికి భక్తులు పోటెత్తతున్నారు.

మేడారానికి భక్తులు పోటెత్తతున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క-సారక్క దేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తుల బారులు తీరారు. ఈ నెల 28వ తేదీ నుంచి మేడారంలోని సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. అయితే ముందుగానే భక్తులు దర్శించుకోనున్నారు. గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
లక్షల సంఖ్యలో రావడంతో...
భక్తులు అత్యధికంగా సొంత వాహనాలతో తరలి రావడంతో పస్రా-మేడారం మధ్య వాహనాల రద్దీ పెరిగింది. దర్శనానికి లక్షల మంది భక్తుుల వస్తారని అంచనా వేసిన అధికారుల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలతో రహదారులపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా పోలీసుల ఎక్కడికక్కడ జాగ్రత్తలు చెబుతున్నారు. వరస సెలవులతో భక్తుల రద్దీ పెరిగింది.
Next Story

