Fri Dec 05 2025 19:45:38 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడ వాసులకు శుభవార్త
విజయవాడ వాసులకు పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. నేటి నుంచి విజయవాడకు రెండు విమాన సర్వీసులను ప్రారంభమయ్యాయి

విజయవాడ వాసులకు పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. నేటి నుంచి విజయవాడకు రెండు విమాన సర్వీసులను ప్రారంభమయ్యాయి. ఇండిగో విమానాలను ఈ రెండు నగరాల మధ్య నడపనున్నారు. విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు విమానాలు రాకపోకలు ప్రారంభం అవ్వడంతో విజయవాడ, విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెండు విమాన సర్వీసులు...
ఇండిగో, ఎయిరిండియా సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ప్రారంభించారు. విజయవాడలో రాత్రి 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 82.0 గంటలకు విశాఖ చేరుతుంది. అక్కడి నుంచి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడకు చేరనుంది. దీంతో రెండు నగరాల మధ్య ప్రయాణం మరింత సులువుగా మారనుంది.
Next Story

