Thu Jan 29 2026 06:00:27 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : పొలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇండియన్స్ కు గుడ్ న్యూస్
పోలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ నుంచి వచ్చే భారతీయులకు ఎలంటి అవసరం లేదని ఆ దేశం పేర్కొంది

పోలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ నుంచి వచ్చే భారతీయులకు ఎలంటి అవసరం లేదని ఆ దేశం పేర్కొంది. ఇది ఉక్రెయిన్ నుంచి బయటపడాలని భావిస్తున్న భారతీయులకు పెద్ద ఊరట అని చెప్పాలి. అయితే భారతీయులు ఎక్కువగా రొమానియా సరిహద్దుకు చేరుకుంటున్నారు. మైనస్ డిగ్రీల చలిలో వారు వణికి పోతూ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు.
సరిహద్దుల్లో....
తమను ఇక్కడి నుంచి భారత్ కు తరలించాలని ఎంబసీ అధికారులను వేడుకుంటున్నారు. మరోవైపు భారత రాయబార కార్యాలయం స్పష్టమైన ప్రకటన చేసింది. దక్షిణ ప్రాంతం నుంచి సరిహద్దులకు చేరుకోవాలని కోరింది. దక్షిణ ప్రాంతానికి రైలులో ప్రయాణించవచ్చని, అక్కడ రైలులో ప్రయాణించడానికి టిక్కెట్ కూడా అవసరం లేదని పేర్కొంది.
Next Story

