Thu May 16 2024 10:11:48 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులను?
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలాండ్ సరిహద్దుకు 40 మంది విద్యార్థులు చేరుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలాండ్ సరిహద్దుకు 40 మంది విద్యార్థులు చేరుకున్నారు. కాలేజీ బస్సులో వారంతా పోలాండ్ సరిహద్దుకు చేరకున్నారు. వారిని భారత్ కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తియ్యాయి. వారికోసం ప్రత్యేక విమానాలను పంపాలని నిర్ణయించింది. భారతీయ విద్యార్థులు నలభై మంది కళాశాల బస్సులో పోలాండ్ సరిహద్దుకు చేరుకోవడంతో వారిని భారత్ కు తరలించడం సులువయింది.
క్రాకో వీక్ ప్రాంతం ద్వారా....
సొంత వాహనాల్లో వచ్చే వాళ్లు క్రాకో వీక్ ప్రాంతంలోని సరిహద్దు నుంచి దేశం దాటాలని, వాటి వివరాలను తమకు గూగుల్ మ్యాప్ ద్వారా పంపాలని భారతీయ రాయబార కార్యాలయం పేర్కొంది. అక్కడకు చేరుకుంటే తమ వాహనాల ద్వారా బయటకు తీసుకొచ్చి భారత్ కు తరలించడం సులువవుతుందని పేర్కొంది.
Next Story