Fri May 10 2024 05:39:15 GMT+0000 (Coordinated Universal Time)
Ukranine Crisis : నేడు భారత్ కు మూడో విమానం
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈరోజు మూడో విమానం ఢిల్లీకి రానుంది.
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈరోజు మూడో విమానం ఢిల్లీకి రానుంది. బూర్ కాస్ట్ నుంచి నేడు మరో విమానం రానుంది. ఈ విమానంలో దాదాపు 240 మంది విద్యార్థులు భారత్ కు చేరుకుంటారని తెలిసింది. ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమయిన నేపథ్యంలో ఆ దేశ సరిహద్దు దేశాల నుంచి భారత్ విద్యార్థులను తరలించే ఏర్పాట్లు చేసింది.
రెండు విమానాల్లో...
ఇప్పటికే రెండు విమానాలు భారత్ కు చేరుకున్నాయి. ఈ రెండు విమానాల్లో 469 మంది విద్యార్థులు భారత్ కు చేరుకున్నారు. నేడు మూడో విమానం కూడా రానుంది. మొత్తం 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో ఉన్నారని వారందరినీ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Next Story