Mon Apr 29 2024 04:41:22 GMT+0000 (Coordinated Universal Time)
శిల్పాను బుజ్జగిస్తున్న టీడీపీ నేతలు
టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిని టీడీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. ఈరోజు చక్రపాణిరెడ్డిని ఆయన సోదరుడు వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కలిసిన వెంటనే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చక్రపాణిరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతున్నారు. టీడీపీని వీడి వెళ్లవద్దంటూ వారు కోరారు. టీడీపీలో మంచి భవిష్యత్ ఉంటుందని ఈ సందర్భంగా టీడీపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చక్రపాణి రెడ్డి మాత్రం తనను టీడీపీ నేతలు ఇంతకాలం దూరం పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
Next Story