Wed Mar 25 2026 09:43:09 GMT+0530 (India Standard Time)
విజయసాయి వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు దారుణమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తల్లిదండ్రులను నిందించే నీచ స్థాయికి విజయసాయిరెడ్డి దిగారన్నారు. చనిపోయిన తన తల్లిదండ్రులపై నిందలు వేయడం సరికాదన్నారు. ప్రధాని కాళ్లకు నమస్కరించడం భారతీయ సంప్రదాయమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇటువంటి వారిని చేరదీస్తుండం విచారకరమన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అని చంద్రబాబు తెలిపారు.
Next Story

