లూయివిల్ లో దసరా సందడి

కెంటకీ రాష్ట్రం , లూయివిల్ నగరంలో తెలుగు సంఘం (టాక్) ఆధ్వర్యంలో దసరా వేడుకలు వైభవంగా జరిగాయి. జయ నంబూరి బృందం ఆలపించిన విఘ్నేశ్వర ప్రార్థన తో కార్యక్రమం ప్రారంభమైంది.
సంస్థ ప్రెసిడెంట్ ప్రతాప్ చిలుకూరి ఆహూతులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. లత ఉమ్మాజి,రఘు కొడుమూరి,సత్య నోరి, సరస్వతి వడ్లమాని కార్యక్రమానికి వ్యాఖ్యానం అందించారు. అనిల్ రెడ్డి, శ్రీనివాస్ వేమూరి, లత ఉమ్మాజి సాంస్కృతిక కార్యదర్శులుగా వ్యవహరించారు. సినీగీతాలకుచిన్నారులుప్రదర్శంచిన నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. శ్రీని జూలకంటి బృందం ప్రదర్శించిన “టాపిక్ నెవర్ ఎండ్స్”, అనిల్ గంటేటి బృందం ప్రదర్శించిన “అబ్బ అసోసియేషన్” లఘునాటికలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి.

నృత్య కేంద్ర డాన్స్ అకాడెమీ, గురు వందన అకాడెమీల ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శంచిన భరతనాట్యం కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
సంస్థ చైర్మన్ రామ్ వంటిపల్లి కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కార్యవర్గ సభ్యులు చేసిన కృషిని అభినందించారు. డాక్టర్ పుష్పలత పావులూరి విరాళాలను అందించిన సంస్థలను, వ్యక్తులను సన్మానించారు.విరామ సమయంలో నర్మద పాటిల్ బృందం ప్రదర్శించిన "ఫ్లాష్ మాబ్ డాన్స్" ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అనంతరం, సంస్థ నిర్వహించిన వాలీబాల్ క్రీడల్లో విజేతలకు, సాంస్కృతిక కార్యక్ర్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు బహుమతి ప్రదానం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ శ్రీని జూలకంటి కమిటీ సభ్యులకు, యూత్ వాలంటీర్లకు, కళాకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి శశిధర్ సంగరాజు మీడియా కో-ఆర్డినేటర్ గా వ్యవహరించారు.
కార్యక్రమం చివర్లో సంస్ఠ ఆధ్వర్యంలో తెలుగు వంటకాలతో విందుభోజనం ఏర్పాటు చేశారు.

