Sat May 04 2024 18:55:24 GMT+0000 (Coordinated Universal Time)
రెండు జిల్లాలకు జగన్
నేడు గగరపర్రులో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను జగన్ పరామర్శించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రుకు ఈరోజు 11 గంటలకు జగన్ చేరుకుంటారు. అక్కడ దళిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో విషజ్వరాలతో బాధపడుతున్న వారిని పరామర్శిస్తారు. ఏజెన్సీ ఏరియా అయిన రంపచోడ వరంలో రాత్రికి జగన్ బస చేస్తారు. గత కొద్ది రోజులుగా ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు విషజ్వరాలతో బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు రెండు జిల్లాల్లో జగన్ పర్యటించనున్నారు.
- Tags
- జగన్
Next Story