Thu Apr 02 2026 01:48:58 GMT+0530 (India Standard Time)
మద్యం మత్తుకు మరో యువతి బలి

మద్యం మత్తుకు మరో యువతి బలయిపోయింది. అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో యూపీకి చెందిన విద్యార్థిని అనన్య మృతి చెందింది. నిన్న రాత్రి నితిన్ బర్త్ డే వేడుకలు కావడంతో నైట్ పార్టీ జరిగింది. ఈ కారులో అనన్య, నిఖిత, నితిన్ ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వచ్చేసరికి మితిమీరిన వేగంతో ఉన్న కారును అదుపు చేయలేక డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన అనన్య అక్కడిక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.
Next Story

