Sun May 05 2024 05:57:03 GMT+0000 (Coordinated Universal Time)
భవిష్యత్తు లో లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు: పల్లె
రాష్ట్ర మంత్రివర్గంలోకి నారా లోకేశ్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి చేపట్టేందుకు కావాల్సిన అన్ని అర్హతలు లోకేశ్కు ఉన్నాయన్నారు. భవిష్యత్లో లోకేశ్ ముఖ్యమంత్రి కూడా అవుతారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి రికార్డుస్థాయిలో 54లక్షల మందిని సభ్యులుగా చేర్పించిన ఘనత లోకేశ్దని కొనియాడారు. అదే తరహాలో మంత్రి పదవి చేపడితే తప్పకుండా రాణిస్తారని అభిప్రాయపడ్డారు.
Next Story