Mon May 06 2024 13:01:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వైసీపీ డిమాండ్ కు జాతీయ నేతల మద్దతు
తమ పార్టీ అధనేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీలో పలువురు జాతీయ నేతలను కలుస్తున్నారు. సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎల్జేడీ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్ తదితరులను వారు కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. హత్యాయత్నం ఘటనపై విచారణ ఏకపక్షంగా జరుగుతుందని నేతలు వారి దృష్టికి తీసుకువచ్చారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని శరద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కోరారు. ఈ మేరకు వైసీపీ నేతల డిమాండ్ కు తన మద్దతు ఉంటుందన్నారు. శరద్ పవార్, సీపీఐ, సీపీఎం నేతలు కూడా తమకు మద్దతు తెలిపినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Next Story