Mon Apr 29 2024 00:39:47 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : లోక్ సభ మళ్లీ వాయిదా
నాలుగురోజుల సెలవుల అనంతరం ప్రారంభమైన లోక్ సభ మళ్లీ వాయిదా పడింది. సభ ప్రారంభమయిన వెంటనే అన్నాడీఎంకే నేతలు ఆందోళనకు దిగారు. కావేరీ జలమండలి ఏర్పాటు చేయాలని, తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ లో కూడా అదే గందరగోళం చెలరేగడంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు.
Next Story