Sun Apr 28 2024 00:32:33 GMT+0000 (Coordinated Universal Time)
ఫైనల్ కి దూసుకెళ్లిన వెస్టిండిస్!
టి20 వల్డ్ కప్ పోటీల్లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న సెమీఫైనల్లో వెస్టిండీస్ విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించారు. 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గేల్ 5, శామ్యూల్స్ 8, చార్లెస్ 52, సిమన్స్ 83, రస్సెల్ 43 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 43, రెహానే 40 పరుగులు, ధోనీ 15 పరుగులు, కోహ్లీ 88 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు...
Next Story