Thu May 02 2024 21:29:46 GMT+0000 (Coordinated Universal Time)
నగల వ్యాపారులకు మద్దతు తెలిపిన మంత్రి!
కేంద్ర ప్రభుత్వ వైఖరికి హైదరాబాద్ లో నగల వ్యాపారులు రోడ్డెక్కారు. వారి ఆందోళనకు మంత్రి పద్మారావు సంఘీభావం తెలిపారు. నగల కొనుగోలు చేసిన వినియోగదారుల పాన్ కార్డు నంబర్ ను తప్పనిసరిగా రసీదుపై నమోదు చేయాలని, విక్రయాలకు సంబంధించిన మొత్తాలపై ఎక్సైజ్ సుంకం చెల్లించాలంటూ కేంద్రం విధించిన నిబంధనకు వ్యతిరేకంగా గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా నగల వ్యాపారులు ఆదోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వ్యాపారులు శనివారం సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో ర్యాలీని నిర్వహించారు. వ్యాపారుల డిమాండ్ కు మద్దతు తెలియజేస్తూ మంత్రి పద్మారావు కూడా ర్యాలీలో భాగస్థులయ్యారు.
Next Story