Fri Apr 03 2026 05:44:41 GMT+0530 (India Standard Time)
ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం

ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై కొద్దిసేపటిక్రితం ఓటింగ్ జరిగింది. మూజువాణి ఓటుతో బిల్లును లోక్ సభ ఆమోదించింది. దీంతో ట్రిపుల్ తలాక్ చెబితేనేరం అవుతుంది. ముడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ బిల్లును కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. ఉదయం నుంచి దీనిపై చర్చ జరిగింది. ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఒవైసీ దీన్ని వ్యతిరేకించారు. కొన్ని సవరణలు చేశారు ఒవైసీ చేసిన సవరణలను కూడా సభ తిరస్కరించింది. లోక్ సభ బిల్లులో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాతనే ఈ బిల్లు చట్టం రూపంలోకి రానుంది.
- Tags
- ట్రిపుల్ తలాక్
Next Story

