Tue May 14 2024 03:44:34 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపికి మరో షాక్
కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. శిల్పా బ్రదర్స్ టీడీపీ నుంచి వైసీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం వీరిని పార్టీకి దూరం చేయనుంది. ఇప్పటికే శిల్పా బ్రదర్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి భూమాకు మంత్రి పదవి ఇవ్వొద్దని చెప్పారు. అయితే చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ మాత్రం రాలేదు. దీంతో శిల్పా సోదరులు టీడీపీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
పరిస్థితులను గమనించిన అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డిని శిల్పా సోదరుల వద్దకు రాయబారం పంపింది. అయితే శిల్పా సోదరులు మాత్రం పట్టు వీడటం లేదట. తాము తొలుత టీడీపీలోకి వచ్చి పార్టీ కోసం కష్టపడితే చంద్రబాబు ఇటీవల వచ్చిన భూమాకు మంత్రి పదవి ఇచ్చేందుకు ఎందుకు ఇష్టపడుతున్నారని ప్రశ్నించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రరెడ్డి శిల్పా సోదరులను వైసీపీలోకి వచ్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శిల్పా సోదరులు త్వరలోనే వైసీపీలోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
- Tags
- టీడీపీ
Next Story