Thu May 02 2024 12:10:33 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కి షాక్ షాక్ లు ఇస్తున్న నేతలు!
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అజేయంగా కొనసాగుతుంది. అనైతికం అని వైసీపీ అరిచిగీపెడుతున్న తన పని తాను చేసుకుంటూ పోతోంది అధికార పార్టీ. ఇప్పటికే ఓ పదిమంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ లో చేరిపోయారు. ఇప్పుడు పదకుండో వికెట్ రెడీ అయ్యింది. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వైకాపాకు గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక టీడీపీ నేతలు ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారని సమాచరం. త్వరలోనే తెలుగుదేశంలో సుజయకృష్ణ చేరిక ఉటుందని అంటున్నారు. మొత్తమ్మీద ఈ నిరంతర వలసలు వైసీపీ అధినేత జగన్ కు దిక్కు తోచని పరిస్థితిలోకి నెట్టేస్తున్నాయి
Next Story