Sat May 04 2024 15:46:48 GMT+0000 (Coordinated Universal Time)
చావో రేవో తేల్చుకుంటాం
కాపులకు రిజర్వేషన్ కోసం చావో రేవో తేల్చుకుంటామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఈ మేరకు ముద్రగడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. కాపు ఉద్యమాన్ని అణచి వేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు కాని ఉద్యమాన్ని అణిచే శక్తి ప్రభుత్వానికి లేదన్న ముద్రగడ మా పోరాటానికి విశ్రాంతి లేదని చెప్పారు.
రాజధాని నిర్మాణం, బందరు పోర్టునిర్మాణంలో పేద రైతుల నుంచి భూములను బలవంతంగా ప్రభుత్వం లాక్కోవడాన్ని ముద్రగడ తప్పుపట్టారు. కొత్త ఏడాది ముద్రగడ కాపు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. సంక్రాంతి పండగ తర్వాత ఆయన మళ్లీ కాపు ఉద్యమంపై కార్యాచరణను ప్రకటిస్తారని తెలిసింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పర్చాలని కోరుతూ ఉద్యమాన్ని ముద్రగడ ఉధృతం చేయనున్నారు
Next Story