Tue May 07 2024 04:34:57 GMT+0000 (Coordinated Universal Time)
కమిటి ఎదుట హాజరైన ఎమెల్యే రోజా!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఈరోజు సభాహక్కుల సంఘం ఎదుట హాజరయ్యారు. తనపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదుపై సంఘం విచారణ చేపట్టింది. దీనిపై రోజా వివరణను ప్రివిలేజ్ కమిటీతీసుకోనుంది. కాగా ప్రివిలేజ్ కమిటీ గతంలో ఇదే అంశంపై ఎమ్మెల్యే రోజాకు రెండుసార్లు నోటీసు ఇచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల విచారణఖు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ మరోసారి రోజాకు నోటీసులు ఇవ్వటంతో ఈరోజు ఆమె విచారణకు హాజరయ్యారు.
Next Story