Tue May 07 2024 12:40:15 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
ఏపీ ఇంజినీరింగ్., మెడికల్ ప్రవేశాలకు ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంసెట్ 2017 నోటిఫికేషన్ను జెఎన్టియూ కాకినాడ విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 26వరకు రూ.500 ఆలశ్య రుసుము., ఏప్రిల్ 10వరకు రూ.వెయ్యి., ఏప్రిల్ 17 వరకు రూ.5వేలు., ఏప్రిల్ 22వరకు రూ.10వేల లేట్్ ఫీతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19 వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీ రూ.450తో పాటు బ్యాంకు లావాదేవీల చార్జీలు వర్తిస్తాయని ప్రకటించారు.
తొలిసారి ఆన్ లైన్ లో...
తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తోన్న పరీక్ష కోసం 13 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లాకు మూడు కేంద్రాలు., అభ్యర్ధుల సంఖ్యను బట్టి అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్లో పరీక్ష రాసే వారి సంఖ్యను బట్టి సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆన్ లైన్ పరీక్షలు కావడంతో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు.
- Tags
- ఏపీ ఎంసెట్
Next Story