Mon Mar 30 2026 00:19:48 GMT+0530 (India Standard Time)
ఏపీ ఊసెత్తని మోడీ

మోడీ ప్రసంగంలో ఎక్కడా ఏపీ ప్రస్తావన తేలేదు. దాదాపు గంటా నలభై నిమిషాలు మోడీ ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో ఏపీ విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏపీ సాయం ఊసెత్తకుండానే మోడీ తన ప్రసంగాన్ని ముగించారు. మోడీ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ ఎంపీలు తమ నిరసనను ఆపి తమ సీట్లలో కూర్చోవడం విశేషం. ఏపీ ఎంపీలు నిరసననువిరమించినా ఆయన ప్రసంగంలో హామీలకు చోటివ్వలేదు. దీనిపై ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విభజన పాపం కాంగ్రెస్ పార్టీదేనని మాత్రం అన్నారు.
- Tags
- మోడీ
Next Story

