Wed May 08 2024 10:04:11 GMT+0000 (Coordinated Universal Time)
ఉచిత ఇసుక విధానంలో దందా జరిగితే ఊరుకునేది లేదు!
ఉచిత ఇసుక విధానంలో అవినీతి జరిగితే వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసన సభలో ఉచిత ఇసుక విధానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ అక్రమార్కులు ఇసుక దందాలు ఇకనైనా మానాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక విధానంపై తాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 491 ఇసుక రీచ్లు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఏ పొలాల్లోనైనా ఇసుక ఉంటే పూర్తిగా విక్రయించుకునే హక్కు రైతుకే ఉంటుందని స్పష్టం చేశారు. ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటించకుండా నిఘా ఉంచినట్లు తెలిపారు.
Next Story