Thu May 02 2024 11:36:20 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఇద్దరి టీడీపీ ఎమ్మెల్యేలకు ఓటు వేయడం కూడా రాదా?
రాష్ట్రపతి ఎన్నికల్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు తప్పుగా వేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, జితేందర్ గౌడ్ లు రాంగ్ గా ఓటు వేశారని గుర్తించారు. ఎమ్మెల్యేలతో సమావేశమైన బాబు ఈ విషయాన్ని చెప్పారు. ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ పెట్టినా ఓటు తప్పుగా వేయడమేమిటని ప్రశ్నించారు. ఇది ఘోర అవమానమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే మాక్ పోలింగ్ కొంప ముంచిందని టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్ మీద తమ పేర్లను రాశారు. దీంతో ఆ ఓట్లు చెల్లవని చెప్పారు చంద్రబాబు.
Next Story