Thu May 02 2024 15:00:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆయనకు కూడా నాన్బెయిలబుల్ వారెంట్....!
బ్యాంకులను నిండా ముంచేసిన విజయ్మాల్యా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తమ ముందు హాజరు కావాంటూ ఈడీ ఇచ్చిన సమన్లకు మూడోసారి కూడా మాల్యా డుమ్మా కొట్టారు. సమన్లను మాల్యా అసలు పట్టించుకోకపోవడంతో ఈడీ సీరియస్గా ఉంది. మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఆయన పాస్పోర్టు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అయితే మే నెలాఖరులోగా తాను వస్తాననీ మాల్యా చెబుతున్నారు. ప్రస్తుతం మాల్యా బ్రిటన్లో ఉన్నారు. తీసుకున్న అప్పు కింద నాలుగు వేల కోట్లు ఇస్తానని మాల్యా ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీన్ని బ్యాంకులు తిరస్కరించాయి.
Next Story