Thu May 02 2024 20:17:39 GMT+0000 (Coordinated Universal Time)
అధికారులపై సీఎం సీరియస్
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తయిన పనుల మేరకు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. పనుల విషయంలో అలసత్వాన్ని అస్సలు సహించనని ఆయన అధికారులు, కాంట్రాక్టర్లను ఉద్దేశించి చెప్పారు. నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగాలని అన్నారు. ప్రణాళిక ప్రకారం పనులు సాగితేనే చెప్పిన సమయంలోగా పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీతో నీళ్లు ఇవ్వగలుగుతామని చెప్పారు. పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించే సిబ్బంది విషయంలో కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడవద్దని చెప్పారు. పోలవరం పనులను సవాల్ గా తీసుకుని పూర్తిచేయడంలోనే ఇంజనీర్ల సమర్ధత బయటపడుతుందని అన్నారు.
- Tags
- చంద్రబాబు
Next Story