Fri Jan 30 2026 15:54:26 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : స్పీకర్ కు వైసీపీ ఎంపీలు చెప్పేశారు

స్పీకర్ సుమిత్రామహాజన్ తో వైసీపీ ఎంపీల భేటీ ముగిసింది. తమ రాజీనామాలను ఆమోదించాలని వైసీపీ ఎంపీలు కోరారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్ ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలను కోరారు. అయితే తాము మాత్రం ఆఖరి అస్త్రంగా రాజీనామాలు చేశామని, తమ రాజీనామాలను ఆమోదించాలని కోరామన్నారు. ఇప్పటికే ఆలస్యం చేశారని, తక్షణమే తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ ను ఎంపీలు కోరారు. స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించకపోతే రెండురోజుల్లో మళ్లీ స్పీకర్ ను కలుస్తామని వైసీపీ ఎంపీలు చెప్పారు.
Next Story
