Wed Mar 18 2026 05:10:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మాచర్ల మున్సిపాలిటీ వైసీపీదే
మాచర్ల మున్సిపాలిటీని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మొత్తం 26 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులే పోటీ చేశారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో 26 మంది [more]
మాచర్ల మున్సిపాలిటీని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మొత్తం 26 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులే పోటీ చేశారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో 26 మంది [more]

మాచర్ల మున్సిపాలిటీని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మొత్తం 26 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులే పోటీ చేశారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో 26 మంది వైసీపీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ కేవలం ఐదు వార్డుల్లో మాత్రమే నామినేషన్ దాఖలు చేసింది. 26 వార్డులు ఏకగ్రీవంగా గెలవడంతో మాచర్ల మున్సిపాలిటీ వైసీపీ పరమయింది. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గంలో ఐదు ఎంపీపీలను వైసీపీ కైవసం చేసుకుంది. తమపై ఫ్యాక్షన్ ముద్ర వేయవద్దని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు. బెజవాడ నుంచి కొందరు వచ్చి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Next Story

