Sun Mar 15 2026 09:33:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: జగన్ కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన జాతీయ సర్వే
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ప్రముఖ జాతీయ ఛానల్ ఇండియా టుడే – యాక్సిస్ మై నేషన్ సర్వే అంచనా వేసింది. [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ప్రముఖ జాతీయ ఛానల్ ఇండియా టుడే – యాక్సిస్ మై నేషన్ సర్వే అంచనా వేసింది. [more]

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ప్రముఖ జాతీయ ఛానల్ ఇండియా టుడే – యాక్సిస్ మై నేషన్ సర్వే అంచనా వేసింది. ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇవాళ ప్రకటించారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 119 నుంచి 135 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతోందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని తేల్చింది. ఇక, తెలుగుదేశం పార్టీ కేవలం 39 నుంచి 51 స్థానాలు గెలవవచ్చని, జనసేన 1 నుంచి 3 సీట్లు గెలవవచ్చని, ఇతరులు 0 నుంచి 2 స్థానాల వరకు గెలవవచ్చని ఈ సర్వే అంచనా వేసింది. వైసీపీ 48 శాతం ఓట్లు, తెలుగుదేశం పార్టీ 40 శాతం, జనసేన 6 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వస్తాయని తేలింది.
Next Story
