Sat Jan 31 2026 20:34:44 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ రెండువేలు దాటేశారు

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కొద్దిసేపటి క్రితం రెండు వేల కిలోమీటర్లకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామాపురం గ్రామంలో జగన్ రెండు వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఇక్కడ నలభై అడుగుల ఎత్తులో నిర్మించిన పైలాన్ ను ఈ సందర్భంగా జగన్ ఆవిష్కరించారు. జగన్ మరో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయాల్సి ఉంది. జగన్ రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు సంఘీభావంగా పాదయాత్రలు చేశారు.
Next Story
