Sat Dec 20 2025 10:46:16 GMT+0000 (Coordinated Universal Time)
ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తి లేదు
తనపైనా ఒత్తిళ్లు వస్తున్నాయని, ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తి లేదనిఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అవినీతి రహిత పాలన అందించడానికే తాను కట్టుబడి ఉన్నానని వైఎస్ జగన్ [more]
తనపైనా ఒత్తిళ్లు వస్తున్నాయని, ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తి లేదనిఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అవినీతి రహిత పాలన అందించడానికే తాను కట్టుబడి ఉన్నానని వైఎస్ జగన్ [more]

తనపైనా ఒత్తిళ్లు వస్తున్నాయని, ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తి లేదనిఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అవినీతి రహిత పాలన అందించడానికే తాను కట్టుబడి ఉన్నానని వైఎస్ జగన్ చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షించడానికి ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘంతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిపై పోరాటంలో వెనకడుగు వేయవద్దన్నారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందన్నారు. అవినీతి రహిత పాలనకు సహకరించాలని వైఎస్ జగన్ కోరారు.
Next Story

